
- మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తే మరిన్ని అద్భుతాలు
కరువుతో సతమతమవుతున్న రైతును కరివేపాకు సాగు ఆదుకుంటోంది. కడపజిల్లా జమ్మలమడుగు మండలం ఎస్.ఉప్పలపాడులో 350 ఎకరాల్లో రైతులు కరివేపాకు సాగుచేస్తూ ఆదాయం పొందుతున్నా, కష్టానికి తగిన ప్రతిఫలం అందటం లేదు. ప్రభుత్వం ముందుకొచ్చి మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తే ఆరుగాలపు కష్టం దళారుల పాలుకాకుండా ఉంటుందని వారు ప్రభుత్వానికి మొరపెట్టుకుంటున్నారు.
ప్రభుత్వంనుంచి వచ్చే ప్రయోజనాలు తెలుసుకుని సాధించుకోవాలంటే రైతులు సంఘటితమై కలిసికట్టుగా నడవాల్సిందే.
– ‘రైతు స్వరాజ్య వేదిక’ రాష్ట్ర కమిటీ సభ్యుడు కిరణ్ కుమార్ విస్సా.
ధరలో హెచ్చుతగ్గులు
ప్రభుత్వ సహకారంతో మరింత సాగు
ఈ ప్రాంతంలో వందలాది రైతులు కరివేపాకు సాగు చేస్తున్నా దీనికి సంబంధించిన ఉద్యానశాఖ అధికారులెవరూ ఇటువైపు కన్నెత్తి చూడటం లేదు. దీంతో తాము నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంటకు తెగుళ్లు వ్యాపిస్తే గతంలో దీన్ని సాగు చేసిన రైతుల సలహాలతోనే నివారణ చర్యలు చేపట్టాల్సి వస్తున్నదని వారు చెప్పారు. అలాంటి సమయంలో శాస్త్రవేత్తలు సలహాలు అందిస్తే మెరుగైన దిగుబడులు సాధిస్తామని రైతులు చెబుతున్నారు. కరివేపాకు పంటకు మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తే మేం పడిన కష్టం దళారుల పాలు కాకుండా ఉంటుందని వారు చెబుతున్నారు. ఈ పంట సాగుకు రుణ సౌకర్యం, బీమా లాంటివి కల్పిస్తే మరింత స్థాయిలో కరివేపాకు సాగు విస్తీర్ణం పెరిగే అవకాశాలు ఉన్నాయి.
– ఆంధ్రజ్యోతి, ప్రొద్దుటూరు
మార్కెట్ సౌకర్యం కల్పించాలి
కరివేపాకు సాగు లాభదాయకంగా ఉంది. చుట్టుపక్కల గ్రామాల్లో ఎక్కడా ఈ పంటను సాగు చేయడంలేదు. ఎక్కువ ఖర్చుండదు. టెన్షన్ ఉండదు. ప్రభుత్వం మార్కెటింగ్ సౌకర్యం కల్పించగలిగితే రైతులకు మరింత ఆదాయం చేకూరుతుంది. మార్కెట్లో ఉన్న రేటు మాకు తెలియడంలేదు. వ్యాపారులు అడిగిన ధరకు ఇచ్చేస్తు న్నాం. కానీ, వారు అధిక ధర లభించే ప్రాంతాల్లో విక్ర యిస్తూ లాభాలు గడిస్తున్నారు.
ప్రభుత్వ మద్దతు కావాలి
మేం సాగు చేసిన పంటను అధికారులు పరిశీలించి తగిన సలహాలు, సూచనలు ఇవ్వగలిగితే మరింత దిగుబడి సాధిస్తాం. ఈ పంట సాగుకు రుణ సౌకర్యంతోపాటు బీమా సౌకర్యాన్ని కూడా కల్పించాలి. పంటకు తెగుళ్లు వ్యాపిస్తే ఏ అధికారిని కలువాలనో కూడా మాకు తెలియడంలేదు. ఈ పంట సాగు చేసిన పక్క రైతులను అడిగి వారు చెప్పిన మందును పిచికారీ చేస్తున్నాం.