రబీలో వరి పంటకి నారుమడి తయారీ, కలుపు నివారణకు ఏ చర్యలు తీసుకోవాలనే అంశంపై ఆంధ్రప్రదేశ్ రైతాంగానికి ఆచార్య ఎన్.జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఈ దిగువ సూచనలు చేస్తున్నారు.
- నారుమడిని వారం రోజుల వ్యవధిలో మూడు సార్లు దమ్ము చేసి చదును చేయాలి.
- నీరు పెట్టడానికి, తీయడానికి వీలుగా కాలువలు తయారు చేసుకోవాలి.
- ఆఖరి దమ్ములో ఐదు సెంట్లు నారుమడికి 2.2 కిలోల యూరియా, 6.25 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేటు, 1.7 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ వేయాలి.
- విత్తిన 10-15 రోజుల తర్వాత పైపాటుగా 2.2 కిలోల యూరియాను నారుమడిలో చల్లుకోవాలి.
- మొలక కట్టిన విత్తనాన్ని సెంటుకు 4 నుంచి 5 కిలోల చొప్పున ఎకరానికి 20-25 కిలోలు చల్లుకోవాలి. ఆకులు బయటికి వచ్చేసరికి నారుమడికి ఆరుతడులు పెట్టి తర్వాత నీరు నిలిచేట్టు చూడాలి.
- విత్తిన 7-9 రోజులకు ఐదు సెంట్లు నారుమడికి 75 మిల్లీలీటర్లు బెం థియోకార్బ్ లేదా 80 మిల్లీలీటర్లు బ్యూటాక్లోర్ కలుపు మందుల్లో ఒక దాన్ని నారుమడిలో నీటిని తీసివేసి 10 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి.
Credits : Andhrajyothi