వరిని కోసి, కళ్లంలో నూర్చడం ఖర్చుతో కూడుకున్న పని. వరి కోసి, ధాన్యాన్ని నేరుగా అందించే యంత్రం వున్నా దాని ధర సన్న, చిన్నకారు రైతులకు అందుబాటులో లేదు. ఐదు లక్షలకు పైగా ఖరీదు చేసే ఆ యంత్రాన్ని చిన్నరైతులు కొనడం అసాధ్యం. ఈ పరిస్థితుల్లో వరి పండించే సన్న, చిన్నకారు రైతులకు వరికోసే ఆఽధునిక యంత్రాన్ని అద్దెకు ఇస్తే ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. రైతులకు ఖర్చులు తగ్గి లాభాలు పెరుగుతాయి. ఆధునిక యంత్రాన్ని అద్దెపై అందించే ప్రతిపాదనలు ఏమైనా వున్నాయా?
– ఎ సన్యాశిరావు, గుమడాం, విజయనగరం

అద్దెకు ఆధునిక యంత్రం : లీలావతి, జెడీ, వ్యవసాయ శాఖ
నియోజకవర్గం స్థాయిలో ఆధునిక వరి కోత యంత్రాన్ని అందుబాటులో వుంచి, దాన్ని రైతులకు అద్దెకు ఇచ్చే అంశం పరిశీలనలో వుంది. ఈ విధానం అమలయితే సన్న, చిన్నకారు రైతులకు ఎంతో ప్రయోజనకరంగా వుంటుంది. సమయంతో పాటు డబ్బు ఆదా అవుతుంది. శ్రమ తగ్గుతుంది. నాట్లు వేయటం, దక్కి దున్నటం, దమ్ముపట్టడం, కోత, నూర్పిడి పనులు పూర్తి చేయటం ఇలా అన్ని వ్యవసాయ పనులకు యంత్రాలు అందుబాటులోకి వచ్చాయి. ప్రభుత్వం యాంత్రీకరణను రైతులకు అందుబాటులోకి తీసుకువచ్చే చర్యల్లో భాగంగా మొదట నియోజకవర్గ స్థాయిలో ఆ తరువాత మండల స్థాయిలో దశల వారీగా ఆధునిక వరికోత యంత్రాన్ని అందుబాటలోకి తెచ్చే ప్రతిపాదనలున్నాయి.
Credits : Andhrajyothi