పెరటి తోటలతో ఆరోగ్యం.. ఆహ్లాదం

- ఎన్జి రంగా వీసీ దామోదర్నాయుడు చొరవ
పెరట్లో లేదా టెర్రస్ మీద

మన ఇల్ల్లు.. మన కూరగాయలు

ఆమె ఇల్లు ఉద్యానవనం


మట్టి లేకుండా మొక్కల పెంపకం

కేవలం నీటితోనే..
మన ఇళ్లల్లో మట్టి లేకుండా ప్లాస్టిక్ పైప్లలో చిన్న కుండీలు ఏర్పాటు చేసి వాటిలో క్లేపెబల్స్ (మట్టి ఉండలు)వేసి మనకు నచ్చిన పూల మొక్కలు, టమాటాలు లాంటి కూరగాయలు మొక్కలు వేసుకోవచ్చు. వీటికి అందించే నీటిలోనే పోషకాలు కలపడం వల్ల మట్టి అవసరం ఉండదు. మట్టిలో ఉండే పోషకాలు ఈ నీటిలో ఉంటాయి. కనుక మట్టి ప్రసక్తి ఉండదు. ఈ విధానం ద్వారా పెంచే మొక్కలు మనం ఇంట్లో లేకున్నా వాటికి కావలసిన నీటిని తొట్టెలో ఉన్న నీటితో అనుసంధానించడం ద్వారా అవి ఏపుగా పెరుగుతుంటాయి.
నీటి పొదుపు చేయడానికి స్మార్ట్ వాటర్ సిస్టం
బాబాగూడ.. కూరగాయల సాగులో భళా

కాకర సాగుతో అద్భుతాలు
బాబాగూడలో కౌకుట్ల సురేందర్రెడ్డి పాతికేళ్లుగా కూరగాయలు సాగుచేస్తూ మిగిలిన రైతులకు మార్గదర్శకుడయ్యారు. పదెకరాల భూమిలో మూడు దశాబ్దాలుగా వ్యవసాయం చేస్తున్న ఈయన, పన్నెండేళ్లుగా తీగజాతి కూరగాయల సాగుపై దృష్టిపెట్టారు. తొలుత 2004లో ఐదెకరాల్లో వేశారు. తర్వాత 2015లో మరో ఐదెకరాల్లో పందిరివేసి బీర, కాకర వంటి కూరగాయలు సాగు చేస్తున్నారు. నిరడు ఐదెకరాల్లో బీర వేసి మంచి లాభాలు గడించారు. ఈసారి మిగతా ఐదెకరాల్లో థాయ్లాండ్ ప్రాంతానికి చెందిన ఈస్ట్వెస్ట్ మాయా వెరైటీ కాకర హైబ్రిడ్ విత్తనాలను మూడు నెలల కిందట నాటారు. ఇటీవల 15 రోజులుగా ఈ పంట దిగుబడి మొదలవగా రోజు విడిచి రోజు 1500 కిలోల కాకరను మార్కెట్కు సరఫరా చేస్తున్నారు. కాగా 15 రోజులముందు కాకర కిలో రూ.60 పలుకగా ప్రస్తుతం రూ.20కి పడిపోయింది. ఎకరా కాకర సాగుకు రూ.1.3లక్షలు ఖర్చవు తుంది. పంట రెండున్నర నెలలపాటు ఉం టుంది. ఐదు నెలల్లో పూర్తిగా అయిపోతుంది. మెదక్ జిల్లాలోని ఒంటిమామిడి, నగరంలోని బోయిన్పల్లి మార్కెట్లకు కాకరను సరఫరా చేస్తున్నారు. తీగజాతి కూరగాయల సాగులో సురేందర్రెడ్డికి ప్రభుత్వం మండల ఉత్తమ రైతు అవార్డును ప్రదానం చేసింది. భారతీయ కిసాన్ సంఘ్ సభ్యుడు, జిల్లా ఉపాధ్యక్షుడు కూడా అయిన ఆయన, మండల, జిల్లా రైతులకు చేదోడు వాదోడుగా ఉంటున్నారు. రాష్ట్ర వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాస్రెడ్డి ఇటీవల ఆయన వ్యవసాయ క్షేత్రాన్ని పరిశీలించి మంచి దిగుబడులు సాధిస్తున్న సురేందర్ రెడ్డిని అభినందించారు.
నీటి సంపులకు సబ్సిడీ ఇవ్వాలి
పండ్ల తోటల సాగులో మేటి

వ్యవసాయం ఓ పండుగ

నిలువెత్తు పంటలు!

- మట్టి, నీళ్లు లేని సాగు.. ఇన్డోర్ వర్టికల్ ఫార్మింగ్
- సీజన్ ఏదైనా సరే ఏడాదికి 22 పంటలు
- 95శాతం తక్కువ నీరు..
- 75శాతం ఎక్కువ దిగుబడి
- అమెరికా సంస్థ ఏరోఫామ్స్ సాధించిన అద్భుతం
న్యూయార్క్, జూన్ 11: మట్టి, నీళ్లు.. ఈ రెండూ లేకుండా పంటలు పండించడాన్ని ఊహించగలమా? ఊహకు కూడా అందని ఈ అద్భుతాన్ని అమెరికాకు చెందిన ఏరోఫామ్స్ అనే సంస్థ సాధించింది. గత పుష్కరకాలంగా ‘నిలువెత్తు పంటలు’ పండిస్తోంది. ఏరోఫామ్స్ సంస్థ ఇన్డోర్ వర్టికల్ ఫార్మింగ్కు రూపకల్పన చేసింది. ఇన్డోర్ వర్టికల్ ఫార్మింగ్ అంటే.. అంటే ఆరుబయట పొలాల్లో కాకుండా ఒక షెడ్డులోపల, నిలువునా అంతస్తులుగా అరలు పేర్చి, ఎల్ఈడీ లైట్లు, పొగమంచు సాయంతో పంటలు పండించే విధానాన్ని రూపొందించింది. సూర్యుడు చేసే పనిని ఎల్ఈడీ లైట్లు చేస్తే.. నీటి అవసరాన్ని కృత్రిమ పొగమంచుతో తీరుస్తారన్నమాట. ఇలాంటి ఎనిమిది ఇండోర్ వర్టికల్ ఫార్మింగ్ యూనిట్లను ఆ సంస్థ ఇప్పటికే ఏర్పాటు చేసింది. తొమ్మిదోదాన్ని.. ప్రఖ్యాత మన్హట్టన్ ప్రాంతం నుంచి కేవలం గంట దూరంలో న్యూయార్క్లో ఏర్పాటు చేయబోతోంది. 70వేల చదరపుటడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ యూనిట్ ప్రపంచంలోనే అతిపెద్ద వర్టికల్ ఫామ్ యూనిట్. దీనిద్వారా సాధారణం కన్నా 75 శాతం అధిక దిగుబడి సాధించవచ్చట. అదేసమయంలో సాధారణంగా పంటకు ఉపయోగించే నీటిలో 95 శాతం తక్కువ నీరు ఈ సాగుకు అవసరమవుతుందని ఏరోఫామ్స్ చెబుతోంది. ఆ సంస్థ 2004 సంవత్సరం నుంచి ఈ తరహా సాగు చేస్తోంది. సీజన్తో సంబంధం లేకుండా నియంత్రిత వాతావరణంలో చేసే సాగు కావడంతో.. ఇందులో ఏడాదికి 22 పంటలు పండించే అవకాశం ఉందట.
డాబా మీద పండించేద్దాం!
చిన్నప్పుడు అమ్మ చందమామని చూపించి గోరుముద్దలు తినిపించిన డాబా
పతంగులు ఎగరేస్తూ మెట్ల మీద పడి దెబ్బలు తగిలించుకున్న డాబా
చదువు వంక పెట్టి పక్కింటమ్మాయిని చూడ్డానికి ఇష్టంగా ఎక్కిన డాబా
పెళ్లయ్యాక నెచ్చెలితో స్వీట్ నథింగ్స్ చెప్పుకున్న డాబా
కుటుంబమంతా కలిసి వెన్నెల్లో కబుర్లు కలబోసుకున్న డాబా.
మేడ, మిద్దె డాబా… పేరేదైనా దానితో అనుబంధం మాత్రం ఎవరికి వారికే ప్రత్యేకం. ఇప్పుడా డాబానే ఒత్తిడిని మాయం చేసే చలువ పందిరి అవుతోంది. కూరగాయలు పండించే మిద్దె తోటై మురిపిస్తోంది
ఒకప్పుడు డాబా మీదికి వెళ్తే… ఓ పక్కన మెట్ల మీదుగా పైకి పాకిన సన్నజాజి తీగ విరబూసి కన్పించేది. పెరటి వైపునుంచీ సపోటా చెట్టు కొమ్మో, జామచెట్టు కొమ్మో పలకరించేవి. కొబ్బరాకులు గాలికి ఊగుతూ చీకట్లో భయపెట్టేవి. పక్కింటి వారి మామిడి కొమ్మ ఒకటి అలా అందీ అందనట్లు పిట్టగోడను తాకుతుంటే లేత పిందెలు ఊరించేవి. చాపో పరుపో వేసుకుని పడుకుంటే పైన చందమామా చుట్టూ చల్లని గాలీ… హాయిగా నిద్రపట్టేసేది.
ఇప్పుడో… నీళ్ల ట్యాంకులకు తోడు రకరకాల సైజుల్లో డిష్ యాంటెన్నాలూ, స్విచ్బాక్సులూ, సెల్ఫోన్ టవర్లూ, కేబుల్ వైర్లతో గందరగోళానికి అర్థంలా ఉంటాయి డాబాలు. అక్కడికి వెళ్లి ప్రకృతిని ఆస్వాదించే తీరికా, శుభ్రంచేసి ఉపయోగించుకునే ఓపికా ఉన్నవారు అదృష్టవంతులే. ఇక అపార్ట్మెంట్లకైతే పైకప్పు మీద ఏ ఒక్కరి హక్కూ ఉండదు. అది సమష్టి సొత్తు కావడంతో ఎవరికి పుట్టిన బిడ్డరా వెక్కి వెక్కి ఏడుస్తోంది అన్నట్లు తయారైంది నగరాల్లో డాబాల పరిస్థితి.
ఒక్క హైదరాబాదునే తీసుకుంటే అక్కడ ఉన్న భవనాల పైకప్పు దాదాపు 40వేల ఎకరాల వైశాల్యం ఉంటుందట. అందులో సగం విస్తీర్ణాన్ని కూరగాయల పెంపకానికి ఉపయోగించినా ఎన్నో సమస్యలు తీరతాయంటున్నారు ఉద్యానవన నిపుణులు. రసాయన ఎరువులూ క్రిమిసంహారకాలూ వాడని తాజా కూరగాయలు తక్కువ ఖర్చులో లభిస్తాయి. కేవలం 200చ.మీ. స్థలం ఉంటే అందులో ఒక్క కూరగాయలే కాదు, పండ్లూ, పూలూ చాలా పండించవచ్చు.
క్రీస్తు పూర్వమే…
డాబాపైన మొక్కలు పెంచడమనేది ఇప్పుడు కొత్తగా కనిపెట్టిన విషయమేమీ కాదు. క్రీస్తుపూర్వం మెసపొటేమియా నాగరికత నాటికే ఈ పద్ధతి ఉందట. భవనం అందంగా కనిపించడం కోసం రోమన్లు ముందువైపు ఇంటి పైకప్పు ప్రత్యేకంగా కట్టించి దాని మీద మొక్కలు పెంచి పూల తీగెలు కిందికి వేలాడేలా చేసేవారట. రోమ్, ఈజిప్టు లాంటి చోట్ల పురావస్తు తవ్వకాల్లో బయటపడిన పలు భవనాల్లో ఇలాంటి పైకప్పు తోటలు కన్పించాయని చరిత్ర చెబుతోంది. పురాతన ప్రపంచానికి చెందిన ఏడు వింతల్లో ఒకటైన హ్యాంగింగ్ గార్డెన్స్ కూడా ఎత్తైన భవనాల మీద పెంచిన తోటలే.
ఇప్పటికీ చాలా దేశాల్లోని నగరాల్లో చల్లదనం కోసమూ, మొక్కలు పెంచాలన్న కోరిక ఉండీ స్థలం లేనప్పుడూ డాబాలనే ఆశ్రయిస్తున్నారు. అయితే ఎక్కువగా లతలూ పూల మొక్కలకూ ప్రాధాన్యమిస్తున్నారు. గుబురుగా పచ్చని పొదలుగా ఎదిగే మొక్కల్నే పెంచుతున్నారు. ఆసక్తి ఉన్నవాళ్లు సరదాగా ఒకటీ అరా హైబ్రిడ్ పండ్లమొక్కలను పెంచినా కూరగాయల పెంపకానికి డాబాలను వాడడం అంతగా లేదు. అలాంటిది వాటి మీద కూరగాయలను పెంచడం ఈ మధ్య కాలంలోనే మొదలైంది. కొంతకాలం క్రితం వరకూ అక్కడక్కడా మాత్రమే కన్పించిన ఈ మిద్దె తోటలు సోషల్ మీడియావల్ల త్వరగా ప్రాచుర్యం పొందాయి. హైదరాబాద్, వైజాగ్ లాంటి నగరాల్లోనే కాక భద్రాచలం, కొత్తవలస లాంటి పట్టణాల్లోనూ వందలాది ఔత్సాహికులు మిద్దెతోటలను పెంచుతున్నారు.
మొక్కల పెంపకం ఇష్టమైన అభిరుచిగా ఉండేవారు చాలామందే ఉంటారు. దానికి తోడు మిద్దెతోటల ప్రయోజనాలు తెలియడంతో మరింత ఎక్కువగా వాటిని పెంచడానికి ఇష్టపడుతున్నారు. ‘తాజాగా అప్పటికప్పుడు మొక్కలనుంచి కోసి వండుకుంటుంటే ఆ ఆనందమే వేరు’ అంటారు సికింద్రాబాద్లోని మల్కాజ్గిరికి చెందిన సూర్యకుమారి. ‘బజారులో ఏం కొన్నా వాటి మీద ఏ పురుగు మందులు చల్లారో, ఎన్ని రసాయన ఎరువులు వాడారోనన్న సందేహం వదలదు. పైగా పండ్లను మగ్గబెట్టడానికీ రసాయనాలను వాడుతున్నారు. ఆ భయాలు లేకుండా కూరగాయలనూ, పండ్లనూ ఇంటిమీదే చక్కగా పండించుకోవచ్చు’ అంటారామె. మొక్కలు పెంచడం ఆమెకు చిన్నప్పటినుంచీ ఇష్టమే. ఉద్యోగరీత్యా ఇన్నాళ్లూ సాధ్యం కాని ఆ కోరికను ఇపుడు సొంతింటి మీద తోట పెంచి తీర్చుకుంటున్న సూర్యకుమారి 900 చదరపు అడుగుల డాబా మీద నలుగురు మనుషులకు సరిపోను కూరగాయలను తేలిగ్గా పండించగలుగుతున్నారు. పువ్వులంటే ఇష్టంతో ఏకంగా 30 రకాల మందారాలను తమ తోటలో పూయిస్తున్నారామె.
డాబా తోటల వల్ల వ్యక్తిగతంగానే కాదు సమాజానికీ ప్రయోజనం ఉందంటారు తుమ్మేటి రఘోత్తమరెడ్డి. ఆయన సింగరేణి నుంచి వచ్చి హైదరాబాదులో స్థిరపడాలనుకున్నప్పుడు నగరంలో అపార్ట్మెంట్కన్నా శివార్లలో సొంత ఇల్లు కట్టుకోవడానికే మొగ్గు చూపారు. అందుకు కారణం మొక్కల పెంపకం పట్ల ప్రేమే. ఇల్లు పూర్తికాగానే తోటపనీ ప్రారంభించారు. దాదాపు 1230 చదరపు అడుగుల తోటలో కూరగాయలూ, ఆకుకూరలూ, పండ్లూ పండిస్తున్నారు. 8 అంగుళాల మడి లోతులో 20 అడుగుల పొడవు బొప్పాయిని పెంచారాయన. ఏడేళ్లుగా బయట కూరగాయలు కొనలేదని గర్వంగా చెప్తారు. ఆయన తోటలో సపోటా, అంజీర, నారింజ లాంటి పండ్లే కాదు ఆవాలు కూడా పండిస్తారు. ‘మిద్దెతోట’ పేరుతో తన అనుభవాలను క్రోడీకరించి ఔత్సాహికులకు ఉపయోగపడేలా ఓ పుస్తకం రాశారు రఘోత్తమరెడ్డి.
వేడీ కాలుష్యమూ తగ్గుతాయి
‘నగరాలను కాంక్రీట్ అరణ్యాలంటారు కదా… ఆ ప్రభావం తగ్గడానికి అత్యంత చౌక విధానం మిద్దెతోటల పెంపకం’ అనే రఘోత్తమరెడ్డి అందుకు కారణాలూ వివరిస్తారు. డాబాలన్నీ తోటలైతే ఎటుచూసినా హాయి గొలిపే పచ్చదనమే కన్పిస్తుందనీ, పైకప్పులన్నీ చల్లగా ఉండడం వల్ల ఇళ్లలో ఏసీల వాడకం తగ్గుతుందనీ అంటారు. కాలుష్యం తగ్గుతుంది. చల్లని శుభ్రమైన గాలి వస్తుంది. రూఫ్ గార్డెన్ల నిర్వహణ ఖర్చూ తక్కువే. ఒక్కసారి కొద్ది మొత్తం పెట్టుబడి పెడితే చాలు, ఏళ్ల తరబడి ప్రయోజనాలు పొందవచ్చు. రాలిన ఆకులూ అలములతోనే ఎరువు తయారవుతుంది. చేసే శ్రమ వ్యాయామం అవుతుంది.మానసిక ప్రశాంతత లభిస్తుంది. తోటలను పెంచుతున్నవారి మాటలే కాదు, అధ్యయనాలూ ఈ విషయాలను రుజువు చేస్తున్నాయి.
అమెరికాలోని షికాగో సిటీ హాల్ రూఫ్ గార్డెన్కి పేరొందింది. రూఫ్ గార్డెన్ వల్ల ఉష్ణోగ్రతల్లో ఏమాత్రం తేడాలు ఉంటాయో పరిశీలించడానికి శాస్త్రవేత్తలు ఆ భవనంలో ప్రయోగాలు చేశారు. వారి పరిశీలనలో తేలిందేమిటంటే- రూఫ్ గార్డెన్ ఉన్న భవనానికీ లేని భవనానికీ ఉష్ణోగ్రతలో 10డిగ్రీల సెల్సియస్ (50 డిగ్రీల ఫారెన్హీట్) తేడా ఉందని. సాధారణంగానే పట్టణాలూ నగరాల్లో చెట్లు చాలా తక్కువగా ఉంటాయి కాబట్టి శివార్ల కన్నా అక్కడ 5 డిగ్రీల వరకూ ఉష్ణోగ్రత ఎక్కువ ఉంటుందంటారు. అర్బన్ హీట్గా పేర్కొనే ఈ అధిక ఉష్ణోగ్రతలను నియంత్రించడానికి డాబా తోటలు బాగా పనికొస్తాయంటున్నారు నిపుణులు.
ఇలా చేయవచ్చు!
డాబా మీద తోట పెంచాలనుకునేవారు ఒక్కో మొక్కా పెట్టుకుంటూ నెమ్మదిగా పెంచుకోవచ్చు. లేదంటే ఒకేసారి అందుబాటులో ఉన్న స్థలాన్ని ఒక ప్రణాళిక ప్రకారం తోటగా అభివృద్ధి చేసుకోవచ్చు. తోట వల్ల భవనానికి నష్టం జరగదు. ఎలాంటి డాబా అయినా తోటను మోయగల సామర్థ్యం ఉంటుంది. డాబా మీద తోటకి 8 అంగుళాల మందంలో మట్టి చాలు. భవనం బీమ్లను బట్టి వెడల్పుగా మడులు కట్టుకుంటే ఆ బరువు సమంగా వ్యాపిస్తుంది. మట్టిని డాబా నేల మీద నేరుగా పోయకుండా ప్లాస్టిక్ టబ్బుల్లో, తొట్లలో, కాంక్రీట్తో ప్రత్యేకంగా కట్టిన మడుల్లో పోసి మొక్కలు పెంచుతారు కాబట్టి నీరు కానీ మొక్కల వేళ్లు కానీ కప్పులోకి వెళ్లడమనేది ఉండదు. కొత్తగా ఇల్లు కట్టుకునేవారు తోటను కూడా దృష్టిలో పెట్టుకుని అందుకు తగినట్లుగా కట్టుకుంటే మంచిదంటారు రఘోత్తమరెడ్డి. ఆయన తోటపనిని ఒక కళలాగా సాధన చేస్తున్నారు. కుండీలకు ఎర్రరంగు వేసి ముగ్గులతో తీర్చిదిద్దుతారు. మొక్కల మధ్య టెర్రకోట బొమ్మల్ని అందంగా అలంకరిస్తారు. ఏడాదికోసారి మొక్కల వేళ్లు దెబ్బతినకుండా పైపైన మట్టిని కాస్త పెళ్లగించి తీసి ఆ మేరకు కొత్త మట్టిని చేరిస్తే చాలు, ఏడాదికి రెండు పంటలు తేలిగ్గా పండించుకోవచ్చంటున్నారు ఈ అనుభవజ్ఞులంతా.
ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టే ప్రభుత్వాలూ ఉద్యానశాఖల ద్వారా ఆసక్తిగల వారికి శిక్షణ ఇచ్చి, కిట్లనూ సరఫరా చేస్తున్నాయి.
ఇంటి మీద ఓ తోట ఉంటే…
ఉదయమే పక్షుల కిలకిలారావాలు వినవచ్చు.
లేలేత ఆకులపై మంచుబిందువుల్లో ప్రతిఫలించే తొలి కిరణాల సౌందర్యాన్ని ఆస్వాదించవచ్చు.
ఇక తోటపనితో ఒంటికి వ్యాయామమూ,
మనసుకు ఉల్లాసమూ లభిస్తాయి.
మొత్తం మీద మిద్దెతోటల పెంపకం ఓ ఆరోగ్యకరమైన కాలక్షేపం.
మరింకెందుకు ఆలస్యం? వెంటనే ఓ మొక్క నాటి, రేపటి తోటకు శ్రీకారం చుట్టేయండి.
మొక్కలు నా ఆరోప్రాణం
– పార్థసారథి, సికింద్రాబాద్
|
ఆరోగ్యానికి తోటపని
– గాంధీ ప్రసాద్, చింతల్, హైదరాబాద్
|
పల్లెనుంచీ వచ్చినవాళ్లం…
– నీలిమ, కూకట్పల్లి, హైదరాబాద్
|
ఇది సరైన సమయం
– రఘోత్తమరెడ్డి, నారపల్లి, రంగారెడ్డి జిల్లా
|
పురుగుమందులు అమ్మేవాణ్ని…
– కర్రి రాంబాబు, కొత్తవలస, విజయనగరం జిల్లా
|
మన ఇల్లూ -మన కూరగాయలూ
నగరాల్లో నివసించేవారు ఇంటివద్దే కూరగాయల్ని పెంచుకునేలా ప్రోత్సహించే కార్యక్రమానికి తెలంగాణ ప్రభుత్వం పెట్టిన పేరిది. రాష్ట్రీయ కృషి వికాస్ యోజన అనే పథకం కింద దీనికి ప్రభుత్వం ఆర్థికసాయమే కాకుండా అవసరమైన వస్తువులనూ అందజేస్తుంది. సహాయం పొందడానికి అర్హతలు: కనీసం 50 – 200 చదరపు ఏమిస్తారంటే: ప్రస్తుతం ఉద్యానవనశాఖ రెండురకాల కిట్లను ఇస్తోంది. ఇంటికి రెండు కిట్లతో పాటు ఉచితంగా సాగులో శిక్షణ కూడా ఇస్తుంది. కిట్ ‘ఎ’ యూనిట్ ధర రూ.6 వేలు. 50శాతం సబ్సిడీ. సిల్పాలిన్ కవర్లు, గ్రోబ్యాగ్స్, మట్టి మిశ్రమం, విత్తనాలు, వేపపిండి, వేపనూనె, తోటపనికి అవసరమైన ఇతర పనిముట్లు… ఈ కిట్లలో ఉంటాయి. పూర్తి సమాచారం … |
– పద్మశ్రీ యలమంచిలి
Credits : EENADU 30th January 2018