
- క్యాను రూ.500 పైమాటే

Agriculture news
கால்நடை
తెలుగు రాష్ట్రాల్లో ఒకే కేంద్రం
లాభాల తేనెపట్టు
ఒక రాణి( పరిపూర్ణమైన ఆడ ఈగ). వేల సంఖ్యలో కూలి ఈగలు (అసంపూర్ణమైన ఆడ ఈగలు) , వందల సంఖ్యలో పోతు(మగ) ఈగలు ఒక గుంపుగా కలిసి ఉండటాన్ని తేనెపట్టు లేదా తేనెతుట్టె అంటారు. తేనె పట్టుకున్న బలాన్ని బట్టి శక్తి సామర్థ్యాలను ఆ పట్టులోని శ్రామిక(కూలి) ఈగల సంఖ్య బట్టి నిర్ధారిస్తారు. ఎన్ని ఎక్కువ శ్రామిక ఈగలు ఉంటే ఆపట్టును బలమైన తేనెపట్టు అంటారు తేనెపట్టుల అభివృద్ధికి, మంచి దిగుబడికి పుప్పొడి, మకరందం ఉండే పుష్పజాతులు అందుబాటులో ఉండాలి. అన్ని ప్రాంతాల్లో ఈ పుష్పజాతులు కొన్ని మాసాల్లో విరివిగా లభించడం వల్ల తేనెదిగుబడి ఎక్కువగా ఉంటుంది. మెట్ట ప్రాంతంలో నువ్వు, ఆవాలు, జనుము, పిల్లిపెసర, దోస, పుచ్చ, కంది మొదలైన పూతల వద్దకు తరలించి మంచి తేనె దిగుబడిని పొందుతున్నారు. వేప, తాడి, జీడిమామిడి, చింత, నల్లమంది, నేరేడు, ములగ, కానుగ, కరక్కాయ, కుంకుడు, నీలగిరి, కొబ్బరి, కాఫీ, నిమ్మ, నారింజ, మామిడి, బూరుగ, ఈత, పామాయిల్ చెట్లతో పాటు అపరాల పంటలు ఉన్న ప్రాంతాల్లో తేనెదిగుబడి ఎక్కువగా లభిస్తోంది.
– ఆంధ్రజ్యోతి ప్రతినిధి, ఏలూరు సిటీ
భారీగా సబ్సిడీలు
విజయరాయిలోని ఈ కేంద్రంలో శిక్షణ పొందిన తర్వాత కొత్త పరిశ్రమ ఏర్పాటు చేసుకునే వారికి కేంద్ర ప్రభుత్వం రాయితీలు కల్పిస్తోంది. గ్రామీణ ఉపాధి కల్పనా పథకం ద్వారా జాతీయ బ్యాంకులలో రుణం పొందిన వారికి ఈ పరిశ్రమ ఏర్పాటు చేసిన తర్వాత సబ్సిడీలు అందజేస్తున్నారు. రూ. 10వేలు నుంచి రూ.5 లక్షల వరకు బ్యాంకులు రుణాలు అందిస్తుండగా ఈ పరిశ్రమ స్థాపించిన వారికి ఒసి పురుషులుకు మాత్రం 25 శాతం, మిగిలిన ఎస్సి, ఎస్టి, బిసి, ఒసి మహిళలకు అందరికీ 35శాతం సబ్సిడీ అందజేస్తున్నారు. బ్యాంకు రుణం పొందిన వారికి మాత్రమే ఈ సబ్సిడీలు అందజేస్తారు.
ఉజ్వల భవిత
విజయరాయిలో ఉన్న రాష్ట్రస్థాయి తేనెటీగల పెంపక విస్తరణ కేంద్రంలో కేవలం శిక్షణా కార్యక్రమాలే నిర్వహిసున్నాం. ప్రస్తుతం తేనెకు మంచి గిరాకీ ఉండడంతో తేనెటీగల పరిశ్రమలపై రైతులు మొగ్గు చూపుతున్నారు. నిరుద్యోగులు, చిరుద్యోగులు, వయస్సుతో నిమిత్తం లేకుండా అందరూ ఈ పరిశ్రమ పట్ల మొగ్గుచూపడంతో రాబోయే రోజుల్లో ఈ పరిశ్రమ మరింత విస్తరించే అవకాశం ఉంది.
కష్టమైనా లాభదాయకం
అలవాటులేని వారికి కష్టమైన పరిశ్రమ, కష్టపడి పనిచేస్తే ఈ పరిశ్రమలో మంచి ఫలితాలను పొందవచ్చు. విజయరాయిలో అందించిన శిక్షణ ఎంతో ఉపయోగపడుతుంది. ఈ శిక్షణతోపాటు ప్రయోగాత్మకంగా రైతుల వద్ద మెలకువలు నేర్చకుంటే తేనెటీగల పరిశ్రమలో మంచి ఆదాయాన్ని పొందవచ్చు.
నాగర్కర్నూల్ వ్యవసాయం: ఎన్నో ఏళ్లుగా గొర్రెల పెంపకంపై ఆధారపడి దుర్భర జీవితాలను వెల్లదీస్తున్న కురుమ, యాదవులు, రానురాను ఆ వృత్తికి దూరమవుతున్నారు. ప్రస్తుత కంప్యూటర్ యుగంలో గొర్రెల పెంపకాన్ని కొనసాగించే పరిస్థితి లేకుండా పోయింది. కానీ అనాదిగా వస్తున్న సంప్ర దాయ వృత్తిని వదులుకోలేని పాతతరం వ్యక్తులు అష్టకష్టాలు పడుతూ గొర్రెల మందలను ఇతర ప్రాంతాలకు తోలుకెళ్లి పెంపకాన్ని కొనసాగి స్తున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన సబ్సిడీ గొర్రెల పథకం వారి జీవితాల్లో వెలుగులు నింపనుంది. సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం నాగర్ కర్నూల్ జిల్లాలో గొర్రెల కాపరులు దాదాపుగా లక్షా 16 వేల జనాభా ఉంది. 225 గొర్రెల కాపరుల సంఘాలు ఉండగా 16,150 మంది సొసైటీల్లో సభ్యులుగా ఉన్నారు. ప్రభుత్వం ప్రకటించిన ప్రకారం ఒక్కో కుటుంబానికి 20 గొర్రెల చొప్పున రానున్నాయి. ఇక అందరికీ మంచి రోజులే..
సరఫరాకు సరిపడా గొర్రెలేవి
గొర్రెల కాపరులందరికీ రాష్ట్రంలో గొర్రె లను సరఫరా చేయలేని పరిస్థితి నెలకొంది. దీనికోసం ఇతర రాషా్ట్రల నుంచి గొర్రెలను కొనుగోలు చేసి ఇవ్వనున్నారు. ఇందులో భాగంగా నాగర్కర్నూల్ జిల్లా గొర్రెల పెంపకందారులకు కూడా ఇతర జిల్లాల నుంచి తెచ్చి అందివ్వనున్నట్లు అధికారులు చెబుతున్నారు. దీంతో రాష్ట్రంలోని గొర్ల పెంపకందారులకు మంచి రోజులు రానున్నాయి. 75 శాతం సబ్సిడీపై జీవాల యూనిట్లను పంపిణీ చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ప్రకటనతో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. సమైక్య రాష్ట్రంలో గొర్రెల పెంపకం దారులకు ఎప్పుడూ అన్యాయమే జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం తీసుకున్న ప్రస్తుత నిర్ణయంతో గొర్లకాపరులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
గతంలో 20 శాతమే సబ్సిడీ
గతంలో గొర్రెల కాపరులకు ప్రతియేటా రుణాలను మంజూరు చేసేవారు. లక్ష రూపా యల రుణంలో 20 గొర్రెలు, ఒక పొట్టేలు మం జూరు చేసేవారు. వీటిలో 20 శాతం ప్రభుత్వం సబ్సిడీ చెల్లించేది. రూ.2.68 లక్షలకు వంద గొర్రెలు, 4 పొట్టేళ్లు మంజూరు చేసేవారు. ఇందులో 20 శాతం సబ్సిడీ గొర్రెల కాపరులకు లభించేది. ప్రస్తుతం 75 శాతం సబ్సిడీపై గొర్రెలను సరఫరా చేస్తామని సీఎం ప్రకటించడంతో గొర్రెల కాప రుల్లో అనందానికి అవధులు లేకుండా పోయింది. దీంతో వారంతా సీఎంకు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు అందలేదు
గొర్రెల కాపరులకు సబ్సిడీతో జీవాల యూనిట్లను పంపిణీ చేసేందుకు ప్రభుత్వం నుంచి ఎలాంటి మార ్గదర్శకాలు అందలేదు. ప్రభుత్వం గొర్రెల కాపరు దారు లకు 75 శాతం సబ్సిడీతో జీవా లను అందిం చేందుకు చర్యలు తీసుకోవడం చాలా సంతోష కరం. దీనికి సంబంధించిన మార్గదర్శ కాలు రాగానే తెలియజేస్తాం. అర్హులు దరఖాస్తు చేసుకొని లబ్ధి పొందవచ్చు.
మరికొన్ని గేదెలు కొనుగోలు చేసేందుకు రుణం ఇచ్చేందుకు దాతలు ముందుకు వచ్చారు. మ రో పది గేదెలను ఒకొక్కటి 45 వేల రూపాయలు ఖర్చు చేసి కొన్నారు. గ్రామంలోనే అర ఎకరా పొలంను ఐదేళ్ల లీజుకు తీసుకొని అందులో ఓ షెడ్డు నిర్మించి పాడిపరిశ్రమకు శ్రీకారం చుట్టారు. 2015 అక్టోబర్లో మరో 6 గేదేలు కొనుగోలు చేశారు. ఇప్పుడు వాళ్ల దగ్గర మొత్తం 24 గేదెలున్నాయి.
మా కష్టాలు తీరాయి
ఒకప్పుడు కనీస ఉపాథి లేక ఇబ్బంది పడ్డా. పాడిని నమ్ముకుని ఈ రోజున గౌరవంగా జీవిస్తున్నాం. మా పిల్లలు ఇద్దరూ చదువుకుంటున్నారు. నాలుగు పశువుల నుంచి మా ప్రయాణం 24 పశువులకు పెరిగింది. మా కష్టానికి ప్రజల నమ్మకం తోడైంది. అదే మా విజయ రహస్యం. కరువు రోజుల్లో కూడా పాడి పరిశ్రమను నమ్ముకుని, కష్టపడి పనిచేస్తే ఆదాయానికి ఏ మాత్రం ఢోకా ఉండదు.
నెలకు పాతిక వేలకు పైనే
రోజూ సగటున 35 నుంచి 40 లీటర్ల వరకు పాల దిగుబడి వస్తుంది. అందులో 25 లీటర్ల వరకు ఆమే భర్త సురే్షయాదవ్ ఇంటింటికి వెళ్లి వినియోదారులకు పోస్తారు. మరో 10-15 లీటర్లు విజయ డైరీకి అమ్ముతారు. నీళ్లు కలపని చిక్కటి పాలు కావడంతో వినియోదారులు లీటరుకు 50 ఇస్తున్నారు. విజయ డైరీకి వేసే పాలకు వెన్న శాతాన్నిబట్టి రూ.38 నుంచి రూ.50ల వరకు వస్తున్నది. ఇలా రోజుకు 1500 చొప్పున నెలకు 45 వేల రూపాయల వరకు ఆర్జిస్తున్నారు ఆ దంపతులు. గేదేల పోషణకు మొక్కజొన్న, తౌడు, బియ్యం నూక మిశ్రమం దాణా ఇస్తున్నారు. అంతేకాదూ జొన్నమేత, పచ్చిగడ్డి మేత పశుగ్రాసంగా ఇస్తున్నారు. దాణా, పశుగ్రాసం కొనుగోలు కోసం నెలకు రూ.10 వేలు, వైద్యం కోసం రూ.3-5వేలు కలుపుకొని సగటున పోషణ ఖర్చు రూ.15 వేలకుపైగానే వస్తుంది. వివరించారు. గేదేలకు జబ్బు చేసినప్పుడు పాల దిగుబడి తగ్గే అవకాశం ఉందని, పోషణ ఖర్చులు పోనూ నెలకు సగటున రూ.20 వేల వరకు మిగులుతున్నదని ఆ దంపతులు వివరించారు. కష్టపడితే ఎంచుకున్న రంగం ఏదైనా అందులో రాణించడం సాధ్యమేనని, కరువును కూడా జయించవచ్చని నిరూపించిన ఆ దంపతులను ఆదర్శంగా తీసుకుని పాడిపరిశ్రమ వైపు దృష్టి సారిస్తున్నారు.